తుని రైల్వేస్టేషన్లో జరుగుతున్న ఆందోళనలతో విశాఖ నుంచి ప్రారంభం కావాల్సిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. విశాఖ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, పూరీ-వోఖా ఎక్స్ప్రెస్, విశాఖ-కాకినాడ ప్యాసింజర్ రైళ్లు విశాఖ స్టేషన్లోనే నిలిచిపోయాయి. హౌరా-చెన్నై మెయిల్ను ఎలమంచిలి సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.