Manuguru-Ramagundam new line:
Only one crore sanctioned in the last budget even though two years back IR officials discussed its need.
click here
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : రామగుండం-మణుగూరు లైన్ తెలంగాణకు తలమానికమని దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీ వాస్తవ అభివర్ణించారు. ఈ మార్గం నిర్మాణానికి తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ లైన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆర్థికపరంగా బొగ్గు తరలింపులో ఈ...
more... మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ లైన్ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన వివరించారు. ట్రాక్ నిర్మాణ వ్యయాన్ని సింగరేణి- రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ముందుకు రావడం ముదావహమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ లైన్ ఏర్పాటు విషయమై సింగరేణి సీఎండీ శ్రీధర్ తనతో సమావేశం జరిపారని ఆయన అన్నారు. ట్రాక్ మొత్తం మైదాన ప్రాంతంనుంచి వెళ్లడం ఈ మార్గానికి ప్లస్ పాయింట్గా అభివర్ణించారు