Keralites of vizag welcomed their dream train with sweet distribution to passengers at dvd
*********************************
కేరళ రైలుకు స్వాగతం
గాజువాక, న్యూస్లైన్ : కేరళ రాజధాని తిరువనంతపురానికి దువ్వాడ స్టేషన్ మీదుగా రైల్వే శాఖ కొత్త రైలు నడుపుతోంది. ఈస్టు కోస్టు రైల్వే రూటులో 15906 నంబరు గల వివేక్ ఎక్స్ప్రెస్ వీక్లీ రైలును దిబ్రుగర్ (అసోం) నుంచి కన్యాకుమారి వరకూ ప్రవేశపెట్టారు. ఈ రైలు దువ్వాడ మీదుగా నేరుగా విజయనగరం వైపు వెళ్తుంది. తొలిసారిగా సోమవారం రాత్రి 8 గంటలకు వివేక్ ఎక్స్ప్రెస్...
more... దువ్వాడ స్టేషన్కు చేరుకుంది. రైలును కైరళీ ఆర్ట్స్ క్లబ్ ప్రతినిధులు రైలును ఘనంగా ఆహ్వానించారు. రైలు డ్రైవర్కు, అక్క డి ప్రయాణికులకు మిఠాయిలు పంచి సంబ రాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఎన్. ధనపాలన్ మాట్లాడుతూ తిరువనంతపురానికి నేరుగా రైలు నడపాలని తమ క్లబ్ నాలుగేళ్లుగా జరిపిన పోరాటం ఫలించిందన్నారు. త్వరలో 22851, 22852 నంబర్లు గల హౌరా-మంగుళూరు రైళ్లను కూడా ప్రవేశపెడతామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. తమ పోరాటం ఫలితంగానే గత ఏడాది విశాఖ-కొల్లాం శబరిమల ప్రత్యేక రైలును గత ఏడాది ప్రవేశపెట్టారన్నారు. ఈ రైలును వచ్చేనెల 15 నుంచి వారానికి రెండు రోజులు నడుపనున్నారని ధనపాలన్ చెప్పా రు. ఈ సందర్భంగా రైల్వే మంత్రికి, రైల్వే అధికారులకుకైరళీ ఆర్ట్స్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.