తెగిపడిన రైల్వే విద్యుత్ వైర్లు
నల్గొండ : నల్గొండ జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోవటంతో సోమవారం ఉదయం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పుష్పుల్ రైలును భువనగిరిలో నిలిపివేశారు. కాకతీయ, జన్మభూమి, ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
*******
Electrical lines at bibi nagar near SC are broken. AP express, Janmabhoomi and other trains stopped at various stations