ఏపీకి ప్రత్యేక జోన్ అంశంపై చర్చిస్తున్నాం.....
Sep 19, 2014 at 05:21 PM
రైల్వే కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత ఏపీకి ప్రత్యేక జోన్ అంశంపై చర్చిస్తామన్నారు రైల్వే శాఖమంత్రి సదానందగౌడ. అక్టోబర్ 14న కమిటీ నివేదిక వస్తుందన్న ఆయన.. నివేదిక తర్వాత రెండు రాష్ట్రాలకు కేటాయింపులుంటాయన్నారు. రైల్వే ఎస్సైల పరేడ్ కు విచ్చేసిన సదానంద గౌడ...భారత రైల్వేల్లోనే సౌత్ సెంట్రల్ రైల్వే అత్యుత్తమంగా నిలుస్తుందన్నారు. ఎఫ్ డిఐలు కేవలం రైల్వే అభివృద్ధి కోసమే అనుమతించినట్లు ఆయన తెలిపారు.