Electric Locos for Goods trains till Cumbum. Planning to finish electrification till Diguvametta soon. Land acquisition for doubling in progress. Target for completion of doubling - 2 years.
నరసరావుపేట : ఎన్నో ఏళ్లుగా విద్యుత్ రైళ్ల కోసం కంటున్న కల సాకారమైంది. నల్లపాడు నుంచి కంభం వరకు విద్యుత లైన నిర్మాణం పూర్తయింది. విద్యుత్ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు చేపట్టారు. తొలి దశలో నల్లపాడు నుంచి కంభం రైల్వేస్టేషన్ వరకు 170 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రూ.380 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ ఈ పనులు చేపట్టింది. తొలివిడతగా రెండురోజుల నుంచి గూడ్స్ విద్యుత్ రైళ్లు గుంటూరు నుంచి కంభం వరకు పరుగులు తీస్తున్నాయి. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు రైల్లే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈనెల 18న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పనులకు తొలివిడతగా ప్రభుత్వం రూ.124...
more... కోట్లు మంజూరు చేసింది. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు 401.47 కిలో మీటర్లు డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు రూ.3,631 కోట్లు వ్యయం అంచనా వేశారు. సింగిల్ లైన్ విద్యుదీకరణ పనులు కంభం వరకు పూర్తయ్యాయి. కంభం నుంచి దిగువమెట్ట వరకు సుమారు 96 కిలో మీటర్లు విద్యుదీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం గూడ్స్ విద్యుత్ రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ త్వరలోనే ప్రయాణీకుల విద్యుత్ రైళ్ళను కూడా ఈ పట్టాలపై పరుగులు తీయించేందుకు రైల్వేశాఖ సమాయత్తమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువ మెట్ట నుంచి గుంతకల్లు వరకు సింగిల్ లైన్ విద్యుదీకరణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కంభం వరకు విద్యుత్ రైళ్లను నడపనున్నారు. ఇప్పటివరకు గుంటూరు వరకే విద్యుత్ రైళ్ళ సౌకర్యం వుంది. గుంటూరు నుంచి కంభం వరకు విద్యుత్ రైళ్ళను నడిపి అక్కడినుంచి డీజిల్ ఇంజన్లను కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి విద్యుత్తో రైళ్లు నడవనుండటంతో వీటి వేగం పెరగనుంది. ప్రయాణం కూడా సులభతరం కానుంది. ఇదే లైన్లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు సంబందించి రాయలసీమ ప్రాంతంలో భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. రెండేళ్ళల్లో డబ్లింగ్ కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద గుంటూరు నుంచి గోవా, బెంగళూరు సర్వీసులు వేగ వంతంగా నడిచే అవకాశాలు వున్నాయి. ఈ లైన్ లో సరుకుల రవాణా వలన భారీగా ఆదా యం లభిస్తుంది. మొత్తం మీద విద్యుత్ రైళ్ళు రెండు రో జులుగా నరసరావుపేట మీదుగా నడుస్తుండ టంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
click here