కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి
13/05/2013
TAGS:
విశాఖపట్నం, మే 12: కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి. ఒకేసారి అయిదు కొత్త రైళ్ళు పట్టాలెక్కడం విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గుడ్డిలో మెల్లగా ఏడాదికోసారి, లేదంటే రెండు మూడు దశల్లో ఒక్కో కొత్త రైలును మాత్రమే అందించే భారతీయ రైల్వే ఈసారి అయిదు రైళ్ళకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ విశాఖ నుంచి బయలుదేరి వెళ్తున్నవే కావడం మరో ప్రత్యేకత. ఇందులో విశాఖ-రాయగడ మధ్య రైల్వే కొత్త రైలును ప్రవేశపెట్టింది. దీనివల్ల రాయగడ పాసింజర్ రద్దీని తగ్గించినట్టు అవుతుంది. ఉత్తరాంధ్ర...
more... జిల్లాల ప్రయాణికులకు ఇదొక వరం కానుంది. ఇటీవల విపరీతంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు పేద, మధ్యతరగతి వర్గాలకు పెనుభారంగా మారిన తరుణంలో రాయగడ నుంచి విశాఖకు కొత్త రైలును ప్రవేశపెట్టడంతో వలస కార్మికులు, చిల్లర వర్తకులు, చిరు ఉద్యోగులు, పేద కుటుంబాలకు ప్రయోజనకరంగా నిలువనుంది. ఇది జూలై మొదటి వారంలో పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే విశాఖవాసులు కొనే్నళ్ళుగా కంటున్న కలలు నిజం అయినట్టుగా విశాఖ-కొల్లాం ప్రత్యేక రైలు ఇక నుంచి రెగ్యులర్ కానుంది. ప్రస్తుతం ఇది ప్రతి గురువారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. దీనివల్ల సీజన్లో అయ్యప్ప భక్తులకు కాస్త సౌలభ్యంగా ఉంటుంది. నిత్యం చెన్నై తదితర ప్రాంతాలకు తరలి వేళ్ళె వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇంతవరకు బొకారో ఎక్స్ప్రెస్ మాత్రమే భక్తులకు, ప్రయాణికులకు ఆధారంగా ఉండేది. అటువంటిది ఇపుడు రెగ్యులర్గా నడిచే కొల్లాం ఎక్స్ప్రెస్తో కొంతవరకు ప్రయాణికుల కష్టాలు తగ్గనున్నాయి. దీని తరువాత ఇదే తరహాలో విశాఖ-నాందేడ్ ఎక్స్ప్రెస్, విశాఖ-టాటానగర్ (వయా కటక్), విశాఖ-జోధ్పూర్ (వయా టిట్లాగర్, విశాఖ-గాంధీగ్రామ్ (వయా విజయవాడ) మధ్య కొత్త రైళ్ళు వస్తున్నాయి. ఇవి జూలై మొదటి వారం నుంచి నడవనున్నాయి. ఇందుకు సంబంధించి రైల్వేబోర్డు నుంచి ఈస్ట్కోస్ట్ రైల్వే ఉన్నతాధికారులకు ఆదేశాలు రానున్నాయి. ఈ విధంగా కొత్త రైళ్ళు వస్తుండటం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నా, మరోపక్క అయిదేళ్ళుగా పెండింగ్లో ఉన్న మళ్ళింపు రైళ్ళకు మోక్షం లభించకపోవడంపట్ల నిరసన వ్యక్తమవుతోంది.