Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Mon Aug 5 23:02:58 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Advanced Search

News Posts by Naagendra V

Page#    Showing 1 to 5 of 40 news entries  next>>
Jul 25 (08:11) Vijayawada Railway: అమరావతి రైల్వే లైను ప్రాజెక్టుకు రైల్వేబోర్డు, నీతిఆయోగ్‌ ఆమోదం: డీఆర్‌ఎం (www.eenadu.net)
14032 views
1

News Entry# 561995   
  Past Edits
Jul 25 2024 (08:11)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jul 25 2024 (08:11)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు. ...

Rail News
14395 views
0

Jul 25 (08:11)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6135606-1              
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు.



విజయవాడ:
...
more...
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు. 2024-25 రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,151 కోట్లు కేటాయించిందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రైల్వే బడ్జెట్‌పై ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ మీదుగా తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలను కలుపుతూ సుమారు రూ.74వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 

‘‘కోనసీమ వాసుల కలగా ఉన్న కోటిపల్లి-నర్సాపూర్‌ మధ్య రూ.2,120 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌ కోసం ఈ ఏడాది రూ.300 కోట్లు కేటాయించారు. విజయవాడ-గూడురు మూడో లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌ కోసం రూ.310కోట్లు ఇచ్చారు. విజయవాడ డివిజన్‌లో నిడదవోలు, దువ్వాడ మధ్య మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విజయవాడ-దువ్వాడ మధ్య ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ నెలకొల్పుతున్నాం. గూడురు-విజయవాడలో ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌తోపాటు ట్రాక్‌ నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. 

అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైను కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు, నీతిఆయోగ్‌ నుంచి ఆమోదం లభించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణం కానుంది. ఏరుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం రూ.2,047 కోట్ల వ్యయంతో 56 కి.మీ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నారు.. అందులో విజయవాడ డివిజన్‌ పరిధిలో 23 స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం రూ.600 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌ సమగ్రాభివృద్ధి కోసం రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఆర్‌ఎల్‌డీఏ) సుమారు రూ. 820 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపింది. 

విజయవాడ డివిజన్‌ పరిధిలో రద్దు చేసిన రైళ్లలో ఇంటర్‌సిటీ వంటివి ఆగస్టు 10 నుంచి పునరుద్ధరిస్తాం. రద్దీ ఎక్కువగా ఉంటూ వెయింటింగ్‌ లిస్టు అధికంగా ఉండే ‘ట్రెయిన్‌ ఆన్‌ డిమాండ్‌’ను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రైల్వేశాఖ ఆదేశించింది’’అని డీఆర్‌ఎం నరేంద్ర వివరించారు.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Jul 25 (07:57) Amaravati railway line: రూ.2 వేల కోట్లతో అమరావతి రైల్వేలైన్‌ అభివృద్ధి (www.eenadu.net)
15078 views
0

News Entry# 561986   
  Past Edits
Jul 25 2024 (07:57)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ...

Rail News
15475 views
0

Jul 25 (07:59)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6135587-1              
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,151 కోట్లుకృష్ణా నదిపై భారీ వంతెన డీపీఆర్‌కు రైల్వే బోర్డు, నీతిఆయోగ్‌ ఆమోదముద్ర 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్‌ ఆధునికీకరణ లోక్‌సభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి 

...
more...


లోక్‌సభలో మాట్లాడుతున్న అశ్వినీవైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత పెద్ద స్థాయిలో ఉందని చెప్పారు.  

బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల పూర్తి, విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ గురించి తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్‌ అడిగిన ప్రశ్నలకు, ఆ తర్వాత రైల్‌భవన్‌లో జరిగిన సమావేశంలో విలేకర్ల ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. 



‘ఆంధ్రప్రదేశ్‌ చాలా ముఖ్యమైన రాష్ట్రం. గత పదేళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించాం. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి ఏటా సగటున రూ.886 కోట్లు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది ఒక్కటే రూ.9,151 కోట్లు కేటాయించాం. యూపీఏ హయాంలో ఏటా సగటున 72 కి.మీ. రైల్లే లైన్ల నిర్మాణం జరిగితే, మోదీ ప్రభుత్వం వచ్చాక అది 150 కి.మీ.కి పెరిగింది. రాష్ట్రంలో రైల్వేలైన్ల విద్యుదీకరణ 100% పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్‌ పథకం కింద 73 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. గత పదేళ్లలో 743 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.26,292 కోట్ల విలువైన 1,935 కి.మీ. 17 కొత్తలైన్ల నిర్మాణం కొనసాగుతోంది’ అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్‌ ఆమోదముద్ర వేసిందన్నారు. తదుపరి దశ అనుమతులకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పురోగతి బాగుందన్నారు. ఈ లైన్‌ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణా నది మీదుగా అమరావతి స్టేషన్‌ నుంచి నంబూరు వరకు వెళ్తుందని మంత్రి వివరించారు. 

రైల్వేజోన్‌కు స్థలం ఇచ్చిన వెంటనే నిర్మాణం  

విశాఖపట్నం కేంద్రంగా తలపెట్టిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కొత్తగా వేరేచోట స్థలం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ‘ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి చెరువు ముంపు నీటిలో ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని పాత ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూ వచ్చాం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లి ఎలాంటి స్థలం అనువుగా ఉంటుందన్నదానిపై చర్చించారు. దీనిపై రామ్మోహన్‌నాయుడితో నేను కూడా మాట్లాడాను. త్వరగా కొత్త స్థలం గుర్తించి, స్వాధీనం చేస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి కూడా చెప్పాం. త్వరలో అడుగులు పడతాయని ఆశిస్తున్నాం’ అని ఆయన వివరించారు. 

ప్రాజెక్టుల వేగం పెంచుతున్నాం

రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని పంచుకొనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉందని.. దీంతోపాటు భూసేకరణ సమస్య గురించీ తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేపరంగా చాలా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ విస్తరణ గురించి ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఆ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌లో చేర్చిన దీని ఆధునికీకరణకు మాస్టర్‌ ప్లానింగ్‌ పూర్తయింది. దేశంలో అత్యధిక రద్దీ ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడను వచ్చే 50 ఏళ్ల కాలాన్ని, సమీపంలో ఉన్న అమరావతిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్, ఇతర ప్రాజెక్టు వివరాలను ఎంపీకి అందజేస్తాం’ అని చెప్పారు.

బెంగళూరు- విజయవాడ వందేభారత్‌!

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి కారణమేంటి? అనకాపల్లి స్టేషన్‌ను ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ఎంపీ సీఎం రమేష్‌ ప్రశ్నించారు. అనకాపల్లి స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో చేర్చి, దాని అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు మంత్రి జవాబిచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి చాలా కారణాలున్నాయని, అందులో భూసేకరణలో జాప్యం అత్యంత ప్రధానమైందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో పనిచేసి భూసేకరణ వేగవంతంగా జరిగేలా చూస్తామని వివరించారు. విజయవాడ, ముంబయి మధ్య దూరం ఎక్కువ కావడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బెంగళూరు - విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Jul 19 (06:52) ఆయ్‌.. కూతంత గళం పెంచండి (www.eenadu.net)
17518 views
0

News Entry# 561034   
  Past Edits
Jul 19 2024 (06:52)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Jul 19 2024 (06:52)
Station Tag: Rajahmundry/RJY added by NaagendraV/309158

Jul 19 2024 (06:52)
Station Tag: Narasapur/NS added by NaagendraV/309158

Jul 19 2024 (06:52)
Station Tag: Kakinada Town Junction/CCT added by NaagendraV/309158
ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్‌ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్‌ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు. ...

Rail News
16324 views
0

Jul 19 (06:53)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6129508-1              
Article Source:

ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్‌ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్‌ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు.

వైకాపా
...
more...
హయాంలో గాలికొదిలేసిన రైల్వే ప్రాజెక్టులుకేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో కూటమి ఎంపీలపైనే ఆశలుఈనాడు, కాకినాడ



ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్‌ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్‌ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు. ఉమ్మడి జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలూ వైకాపాకు కట్టబెట్టినా అయిదేళ్లలో కీలక రైల్వే ప్రాజెక్టులతోపాటు ఏమీ సాధించలేకపోయారు. తాజా ఎన్నికల్లో అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఈ నెల 23న కేంద్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూటమి ఎంపీలు గళం వినిపించి.. అపరిష్కృత రైల్వే ప్రాజెక్టులను పట్టాలెక్కించేలా చొరవ చూపాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.



చుక్‌చుక్‌ బండి.. కోనసీమకు వెళ్లేదెప్పుడండీ! 

కోనసీమ ప్రాంతానికి రైలు మార్గం ఊరిస్తోంది. కేంద్రం బడ్జెట్‌లో ఎంతోకొంత నిధులు కేటాయిస్తున్నా.. గత వైకాపా ప్రభుత్వం నుంచి వాటా నిధులు విదల్చడంలో వైఫల్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.  కీలకమైన కోటిపల్లి నర్సాపురం కొత్త రైలు మార్గానికి తొలిసారిగా రూ.220 కోట్లు, తర్వాత బడ్జెట్‌లో రూ.440 కోట్లు.. 2019 ఎన్నికలకు ముందు కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో రూ.200 కోట్లు, 2020 బడ్జెట్‌లో రూ.551 కోట్లు, 2021లో రూ.187 కోట్లు.. 2022, 2023 బడ్జెట్‌లో రూ.100 కోట్లు.. ఈ ఏడాది ఎన్నికల ముందు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారు.  రాష్ట్ర వాటా రూ.525 కోట్లు కాగా.. ఈ రైలు ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.2.69 కోట్లు మాత్రమే కేటాయించింది. కేంద్రం అడపాదడపా నిధులు ఇస్తున్నా వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్ర వాటా పైసా విదల్చకుండా ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దీంతో నిర్మాణంలో ఏళ్ల జాప్యంతో అంచనా వ్యయం పెరిగింది. వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదులపై వంతెనలు నిర్మించాలి. నిర్మాణ పనులు పట్టాలెక్కిస్తే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది.



నవీకరణకు రాజమహేంద్రి ఎదురుచూపులు  

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌కు నిత్యం 25 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉంటుంది. ఇక్కడ అయిదు ప్లాట్‌ఫారాలున్నాయి. అమృత్‌ భారత్‌ కింద నవీకరణ చేయాల్సి ఉంది. ఈ పనులకు ఎన్నికల ముందు శంకుస్థాపన జరిగినా కదలికలేదు. ఆర్చి వంతెనపై రెండో రైల్వే లైను ఏర్పాటు.. హేవలాక్‌ వంతెనను పర్యాటక ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదనలకూ మోక్షం దక్కలేదు. గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన కాలపరిమితి దగ్గరపడుతున్నందున ప్రత్యామ్నాయంపైనా దృష్టిసారించాల్సిఉంది.



కోస్తాకు పచ్చజెండా ఊపితే.. 

కోస్తా రైలు మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపితే.. కాకినాడ నగరాన్ని ప్రధాన రైలు మార్గానికి అనుసంధాన ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం దొరికినట్లే.. విశాఖ- చెన్నై రైలు మార్గంలోని కాకినాడ జిల్లా అన్నవరం నుంచి కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుతోపాటు కాకినాడ పోర్టు- కోటిపల్లి- నరసాపురం-మచిలీపట్నం-రేపల్లె- నిజాంపట్నం పోర్టులను కలుపుతూ బాపట్ల వరకు ఎన్‌హెచ్‌-216 రహదారికి అనుసంధానంగా కోస్తా రైలు మార్గం నిర్మించాలన్నది ప్రయాణికుల విన్నపం. ఇది సాకారమైతే చెన్నై- విశాఖ ప్రధాన రైలు మార్గానికి ప్రత్యామ్నాయ రైలు మార్గం ఏర్పాటవుతుంది. 50 కి.మీ వరకు దూరం తగ్గుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకూ సౌలభ్యంగా ఉంటుందని ఉమ్మడి తూగో జిల్లా, కోకనాడ టౌన్‌ ప్రయాణికుల సంఘం అధ్యక్షులు, దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ వినియోగదారుల సలహా సంఘం సభ్యులు వైడీ రామారావు ఏళ్లుగా కోరుతున్నారు. కాకినాడ-నర్సాపురం రైలు మార్గం పూర్తయ్యేలా చొరవ చూపుతానని ఎన్నికల బహిరంగ సభలో జనసేనాని భరోసా ఇవ్వడంతో ఈ ప్రభుత్వ హయాంలో సమస్యకు పరిష్కారం దొరకుతుందన్న ఆశ కనిపిస్తోంది.

కాకినాడ మార్గంపై  అంతులేని నిర్లక్ష్యం..

 

కీలకమైన కాకినాడకు ప్రధాన రైలు మార్గం అనుసంధానం కాలేదు. దీంతో ఇటు సామర్లకోట, అటు రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. సినీ నటుడు కృష్ణంరాజు కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైలు మార్గానికి ఆమోదం దక్కినా.. తర్వాత ఎంపీల చొరవ లేక పథకం పడకేసింది. 2016లో ఈ రైలు మార్గానికి రూ.100 కోట్లు కేటాయించినా నిధులు విదల్చలేదు. కాకినాడ- పిఠాపురం డబ్లింగ్‌ పనులు పునఃపరిశీనలో ఉన్నాయని 2020లో అప్పటి రైల్వే మంత్రి చెప్పారు. రూ.240 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 25 ఏళ్లలో రూ.1,500 కోట్లు దాటేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు సన్నగిల్లాయి. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు    తెరమీదికి వచ్చినా పట్టలేదు.

Translate to English
Translate to Hindi

15468 views
1

Jul 19 (07:04)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6129508-2              
Rajahmundry to Jagdalpur new railway line is required. Direct coastal connection to Chhattisgarh and Odisha.
Translate to English
Translate to Hindi

12757 views
0

Jul 19 (09:44)
deepak.yerr~
deepak.yerr~   6457 blog posts
Re# 6129508-3              
Kotipalli Narsapur Railway line will take 3-5 hrs for completion and funds will be alloted in coming years as 3 river bridges pillars are almost completed and land is acquired for some sections.

Rajahmundry Godavari river 4th bridge should be immediately sanctioned and works takeup as traffic increased and it's bottle neck for operating trains everyday. Already modification and auto signalling works are in progress now from Kadiyam to Nidadavolu.
Translate to English
Translate to Hindi

9578 views
0

Jul 19 (20:17)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6129508-4              
Yes. i heard that Kotipalli to amalapuram land acquisition completed.
if gridders arranging works on bridges and track laying works commenced in parallel, we can expect this track may available in 2 to 3 years. Agree new station construction and passenger amenities will take some time. Once route is opened for traffic at least goods trains will utilize.
Translate to English
Translate to Hindi
Jun 22 (09:45) Amravati: మూడు మార్గాలూ డబుల్‌ లైన్లతోనే అమరావతికి న్యాయం (www.eenadu.net)
33198 views
1

News Entry# 557197   
  Past Edits
Jun 22 2024 (21:18)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌...

Rail News
31314 views
0

Jun 22 (21:20)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6102773-1               Past Edits
Article source :

రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్‌ లైన్‌తో ఒరిగేదేంటి?ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్‌ సిద్ధంమొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలిసీఎం చంద్రబాబు జోక్యంతోనే..
...
more...
ఇదంతా సాధ్యంఈనాడు, అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్‌ లైన్‌తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రాజెక్టు అసలు స్వరూపమిది..

అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్‌లో ఇది డబుల్‌ లైన్‌ ఉండగా, సింగిల్‌ లైన్‌కే పరిమితం అవుతున్నారు. 
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..

రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్‌ స్టేషన్‌కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్‌పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్‌కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.

106 కి.మీ. డబుల్‌ లైన్‌ నిర్మిస్తేనే..

రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్‌ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్‌లైన్‌కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్‌ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి

మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్‌లైన్‌కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.

మూడు లైన్లతో మేలు జరిగేదిలా..

1 ఎర్రుపాలెం-నంబూరు లైన్‌తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్‌ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్‌కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్‌ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్‌లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.

2 అమరావతికి దగ్గరి మార్గం.

సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్‌ లైన్‌ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్‌ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్‌ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

3 సీమ నుంచి నేరుగా రాజధానికి..

రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్‌ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్‌ లైన్‌లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్‌-గుంటూరు పాతలైన్‌లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Jun 07 (08:49) Resurgence of BJP in Andhra Pradesh comes as a surprise (www.thehindu.com)
23008 views
0

News Entry# 555037   
  Past Edits
Jun 07 2024 (08:49)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jun 07 2024 (08:49)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Jun 07 2024 (08:49)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
The Assembly election results in Andhra Pradesh have taken everyone by surprise. None expected that Y.S. Jagan Mohan Reddy’s YSR Congress Party (YSRCP) would slip from...

Rail News
21317 views
0

Jun 07 (08:52)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6087006-1              
posting only railway related content.
Translate to English
Translate to Hindi

20642 views
1

Jun 07 (09:01)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6087006-2              
Mr. Vishnu Kuma Raju’s , Can focus on Start the operations of SCOR immediately with available infrastrure instead of building constructions. as we know Building construction will take time. SCOR operations already delayed.
Translate to English
Translate to Hindi
Page#    40 news entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy